Mahanaadu-Logo-PNG-Large

జనసేన నేత కర్రి మహేష్‌ కారుకు నిప్పు

-మచిలీపట్నంలో వైకాపా కార్యకర్తల అరాచకం
-చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు

మచిలీపట్నం: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా కార్యకర్తలు అరాచకం సృష్టిం చారు. జనసేన నాయకుడు కర్రి మహేష్‌ ఇంటి ముందు పార్కు చేసిన కారుకు నిప్పు పెట్టి తగులబెట్టారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం తో దర్యాప్తు చేపట్టారు. ఆదివారం అర్ధరాత్రి 2 గంటల తర్వాత కారును వైకాపా గూండాలు తగులబెట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన తరఫున ప్రచారం చేస్తే తట్టుకోలేక ఈ చర్యకు పాల్పడ్డారని తెలిపారు. గతంలోనూ అర్ధరాత్రి మా ఇంటిపై దాడి చేసి కొట్టి చంపాలని చూస్తే కేసు పెట్టామని వివరించారు. ఇప్పుడు నా కారును తగులబెట్టి రాక్షసానందం పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కారుకు పెట్టిన మంటలు మా ఇంటి గోడ వైపు వ్యాపించాయి. వంట గది అటువైపే ఉంది. అందులోకి మంటలు వ్యాపించి ఉంటే మా కుటుంబం మొత్తం చనిపోయేవాళ్లమని వివరించారు. పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే వైకాపా నేతలు దాడులకు తెగబడుతున్నారని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్పీని కోరారు.