అమరావతి: పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో వైసీపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహా రంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది.