20 నుంచి సబ్సిడీపై విత్తనాలు
అమరావతి, మహానాడు
ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఖరీఫ్ సీజన్ కోసం ఈ నెల 20 నుంచి సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 6.19 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేశారు. ఇందుకు రూ.450 కోట్లు ఖర్చు చేయనుంది. మొత్తం రూ.195 కోట్ల సబ్సిడీ భరించనుంది. పచ్చిరొట్ట, చిరుధాన్యాల విత్తనాలపై 50 శాతం, వేరుశనగ విత్తనాలపై 40 శాతం సబ్సిడీ ఇవ్వనుంది.