అయోధ్య రాముడి పాదాల చెంత నామినేషన్‌ పత్రాలు

ఆశీస్సులు పొందిన బీజేపీ మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌

మెదక్‌: మెదక్‌ బీజేపీ పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘునందన్‌రావు ఏప్రిల్‌ 18న నామినేషన్‌ దాఖలు చేయబోయే ముందు మంగళవారం అయోధ్య రామమందిరంలో బాల రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి పాదాల ముందు నామినేషన్‌ పత్రాలను పెట్టి స్వామి వారి ఆశీస్సులను పొందారు.