నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకే తొలి ప్రాధాన్యం

– ప్రతిష్ఠాత్మకమైన ఏపీపీసీబీ చైర్మన్ గా మాజీ ఐఏఎస్ కృష్ణయ్య
– చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కృష్ణయ్య
– అభినందనలు తెలిపిన నేతలు, పార్టీ కార్యాలయ సిబ్బంది
– సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కు కృతజ్ఞతలు తెలిపిన కృష్ణయ్య

విజయవాడ, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) బీసీల పార్టీ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరోసారి రుజువు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత, ప్రజాహితం కోసం, పార్టీకోసం కష్టపడిన ఎందరో ఆశావాహులు ఎదురుస్తున్న కీలకమైన నామినేటెడ్ పోస్టుల భర్తీకి తొలి అడుగు పడింది. అందులో భాగంగానే విశ్రాంతి ఐఏఎస్ అధికారి పి. కృష్ణయ్యను ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) చైర్మన్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సందర్భంగా ఏపీపీసీబీ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ గా కృష్ణయ్య సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన కృష్ణయ్యను పార్టీ కార్యాలయ సిబ్బంది, నాయకులు ఘనంగా సత్కరించి అభినందించారు. తొలి నామినేటెడ్ పోస్టును దక్కించుకున్న కృష్ణయ్య కోసం కార్యాలయ సిబ్బంది ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ గురజాల మాల్యాద్రి, ప్రోగ్రాం కమిటీ ఇంఛార్జ్ నున్న రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురజాల మాల్యాద్రి మాట్లాడుతూ..తొలి నామినేటెడ్ పోస్టును బీసీలకు చంద్రబాబు కేటాయిండం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఏపీపీసీబీ చైర్మన్‌గా ఆయన రాష్ట్రానికి మరిన్ని విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఐఏఎస్ అధికారిగా కృష్ణయ్యకు ఉన్న అపారమైన అనుభవంతో ప్రభుత్వానికి, ప్రజలకు మరిన్న ఉన్నతమైన సేవలు అందించాలని కాంక్షించారు.