టీడీపీలో సభ్యులుగా చేరడం ఒక వరం

– ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌

వింజమూరు, మహానాడు: వింజమూరు, కలిగిరి మండలాల్లో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సభ్యత్వ నమోదు కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. తొలుత కలిగిరి మండలం పార్టీ ఆఫీస్ లో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్థానిక నాయకులు, కార్యకర్తలతో సభ్యత్వం రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ టీడీపీ సభ్యత్వ నమోదు అనేది ఒక బృహత్తర కార్యమని, ఈరోజు నుండి ప్రారంభం అవుతున్న సభ్యత్వ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో టీడీపీలో సభ్యులుగా చేరడం ఒక వరంగా భావించాలన్నారు.