నరసరావుపేట, మహానాడు: పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి గోనుగుంట్ల కోటేశ్వరరావు, రాష్ట్ర డాక్టర్ సెల్ ఉపాధ్యక్షులు కడియాల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జీవి ఆంజనేయులు వినుకొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలందించడమే గాకుండా, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా శివ శక్తి లీలా ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించి, మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టిపాటి జనార్ధన్ బాబు, షేక్ మన్నాన్ షరీఫ్, కుమ్మెత కోటిరెడ్డి, షేక్ రఫీ, కోట నాగ సుధీర్, గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.