-మూడురోజుల పాటు కార్యక్రమాలు
-విజయవంతం చేయాలని కేసీఆర్ పిలుపు
హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వ ర్యంలో దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. జూన్ 1, జూన్ 2, జూన్ 3 తేదీల్లో మూడురోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
జూన్ 1న గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్ బండ్ దగ్గర అమర జ్యోతి వరకు సాయంత్రం 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణ త్యాగాలు చేసిన అమరులకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పిస్తారు.
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం జరిగి దశాబ్ధి కాలం గడుస్తున్న నేపథ్యంలో దశాబ్ది ముగింపు వేడుకల సభ హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. హైదరాబాద్ నగరంలో పలు ఆసుపత్రులు, అనాథ శరణాలయాల్లో పార్టీ ఆధ్వర్యంలో పండ్లు స్వీట్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
జూన్ 3న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో తెలంగాణ ఆవి ర్భావ దశాబ్ధి ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. ముగింపు వేడులను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ అందించే సూచనలను అనుసరించి ముగిం పు వేడుకల్లో పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.