వారణాసిలో ఈటెల బృందం ప్రచారం

వారణాసి, మహానాడు: తెలంగాణకు చెందిన ఈటల రాజేందర్‌ బృందం వారణాసిలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంది. బీజేపీఎల్పీ నేత మహేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యే రామారావు పటేల్‌, చాడ సురేష్‌రెడ్డి, ధన్పాల్‌ సూర్యనారాయణ, తిరుపతి యాదవ్‌, గంగాధర్‌ గౌడ్‌తో పాటు పలువురు నేతలు ఉన్నారు. సోనార్పూర్‌లో వారణాసి తెలుగు బ్రాహ్మణ సంఘం వారితో సమావేశమయ్యారు. మోదీకి ఓటు వేయాలని కోరారు.