పలాస, మహానాడు: వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కేసు నమోదైంది. గతంలో ఏపీ సీఎం చంద్రబాబు మానసిక పరిస్థితిపై సీదిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేయడంతో పాటు ఓ వైద్యుడిగా ఆ విషయాన్ని తాను ధృవీకరిస్తున్నాను. చంద్రబాబును ఆస్పత్రికి పంపి మానసిక పరిస్థితి బాగైన తర్వాతే అసెంబ్లీకి అనుమతించాలని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై తాజాాగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు.