Mahanaadu-Logo-PNG-Large

చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర

జగ్గయ్యపేట వినాయక గుడి నుంచి ప్రారంభం
ప్రారంభించిన శ్రీరాం చిన్నబాబు

విజయవాడ: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని శనివారం ఉదయం పెనుగొండ సతీష్‌, మహం కాళి ప్రకాష్‌ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట 16వ వార్డు చెరువు బజారుకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరుమలగిరి దేవస్థానానికి పాదయాత్ర చేపట్టారు. జగ్గయ్యపేట పట్టణంలో బంగారు కొట్ల సెంటర్‌ దగ్గర వినాయకుడి గుడి నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది. శ్రీరాం చిన్నబాబు వినాయకుడి గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి పాదయాత్రను ప్రారంభించారు. కేశినేని శివనాథ్‌(చిన్ని) ఎంపీ కావాలని, శ్రీరాం తాతయ్య జగ్గయ్యపేట ఎమ్మెల్యే కావాలని కోరుకున్నారు.