హైదరాబాద్‌ మెట్రో రైలు వేళల్లో మార్పులు

హైదరాబాద్‌: నగరంలో మెట్రో రైళ్లకు సంబంధించి ఇప్పటివరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు ఉండగా ఇక నుంచి 11.45 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉండనుంది. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5.30 గంట లకే మెట్రో రాకపోకలు మొదలు కానున్నాయి. మిగతా రోజుల్లో సాధారణంగానే ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమవుతాయి. ఇటీవల రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో వేళల్లో మార్పులు చేసినట్టు సమాచారం. పొడిగించిన వేళలు శుక్రవారం రాత్రి నుంచి అమల్లోకి వస్తాయని మెట్రో అధికారులు వెల్లడిరచారు.