Mahanaadu-Logo-PNG-Large

మంచి నాయకుడిని ఎన్నుకోండి

ఎస్టీ మహిళలతో ముఖాముఖిలో భువనేశ్వరి

కుప్పం: ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రామకుప్పం మండలం వీర్నమల గ్రామంలో ఎస్టీ మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖిలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు పెరిగా యి. మహిళలు తమకు మంచి చేసే నాయకులు ఎవరో ఆలోచించాలి. మీ సొమ్ము తినే దొంగ నాయకు లు కావాలా? మీకు సంపదను తెచ్చిపెట్టే నాయకుడు కావాలా? తేల్చుకోవాలని కోరారు. నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గ ప్రజలు చూపిస్తున్న ఆదరణ చూస్తే లక్ష ఓట్ల మెజార్టీ ఖాయమనిపిస్తోందన్నారు. కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త పి.ఎస్‌.మునిరత్నం మాట్లాడుతూ కుప్పం లో అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. మరో సమన్వయకర్త మనోహర్‌ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ముసలిమడుగు చెరువు వచ్చిందంటే అది చంద్రబాబు చూపిన చొరవే. వీర్నమల ప్రాంతంలో పరిశ్రమ పెడితే యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయని కోరారు. రామకుప్పం మండల పార్టీ అధ్యక్షుడు ఆనంద్‌రెడ్డి మాట్లాడుతూ సమస్యలు పోవాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు.