అమరావతి, మహానాడు: మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను పలు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారిలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావన, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గార్గ్ లు ఉన్నారు.