సర్వశిక్ష అభయాన్ నిధులతో పాఠశాల ఆవరణలో పక్కా భవనాలు

జగన్ నిర్ణయాలు పేదల పాలిట శాపాలు
విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్

విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు పేద విద్యార్థుల పాలిట శాపాలుగా మారాయని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు.

శనివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్లోని తాడికొండ సుబ్బారావు మున్పిపల్ ;పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్, యూనిఫామ్ పంపిణీ కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హజరై విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం రామాలయం నూతన కమిటి ఎన్నికైన సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో గద్దె రామమోహన్ పాల్గొని అన్నదానం చేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో 400 మంది అన్న ప్రసాదాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న పలు నిర్ణయాల వల్ల పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యాశాఖలో ఎయిడెడ్ విద్యాసంస్థలపై జగన్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఎన్నో ఎయిడెడ్ విద్యాసంస్థలు మూతపడ్డాయన్నారు.

దీనివల్ల పేద విద్యార్థులు చదువుకు దూరం అయ్యారని చెప్పారు. ఎయిడెడ్ వ్యవస్థ వల్ల ప్రభుత్వంపై కొద్దిగా భారం పడినా పేద ప్రజలకు విద్యా పరంగా ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ఎయిడెడ్ వ్యవస్థ ఏర్పాటుపై నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలు చేస్తున్నారని చెప్పారు.

చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే టీచర్ల భర్తీ కోసం మెగా డీఎస్సీ ఫైలుపై మొదటి సంతకం చేశారన్నారు. సర్వశిక్ష అభియాన్ పథకంలోని నిధులతో ఈ పాఠశాలలో ఖాళీ స్థలాల్లో భవనాలు నిర్మాణం చేసి పదో తరగతి వరకు చదువుచెప్పడంతో పాటుగా జూనియర్ కళాశాలను కూడా ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. గతంలో ఇక్కడ ఉ న్న ఆర్సీఎం స్కూల్లో పదో తరగతి వరకు చదువు చెప్పడానికి అంగీకరించారని, వైఎస్. జగన్ అధికారంలోకి వచ్చి ఆ స్కూల్ను మూసివేశారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, వేముల దుర్గారావు, రాయిరంగమ్మ, ప్రధాన ఉపాధ్యాయులు బి.శ్రీదుర్గ, గోగుల రమేష్, వేమల వెంకటేష్, కొక్కెర తిరుపతయ్య, తలపాటి ప్రసాద్, మొకర రమణ, వీరబాబు తదితరులు ఉన్నారు.

స్వయంఉపాధి నిమిత్తం టిఫిన్ బండి పంపిణీ

17వ డివిజన్ రాణిగారితోటలో స్వయం ఉపాధి నిమిత్తం ఉప్పల విజయలక్ష్మీకి గద్దె రామమోహన్ సొంత నిధులతో రూ.25వేలు విలువ చేసే టిఫిన్ బండిని ఉచితంగా అందజేశారు.

చంద్రబాబు పాలనలోనే రాష్ట్రాభివృద్ధి

చంద్రబాబు నాయుడు పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్ జమ్మిసెంటర్ వద్ద గల ఎల్.ఎన్ టవర్స్లో కాలనీ వాసులతో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఆత్మీయ సమావేశం శనివారం

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీలపై నమ్మకంతోనే ప్రజలు కూటమి అభ్యర్థులకు ఇంతటి ఘన విజయాన్ని అందించారని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మూడో సారి గెలవడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.