– మాజీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు
గుంటూరు, మహానాడు: మద్యం స్కామ్లో ఉన్నానంటూ తనపై వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని బీజేపీ మాజీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా సోషల్ మీడియా, కొన్ని ప్రసార మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. రాజకీయ అవకాశాలను దెబ్బతీసే కుట్రలో ఇవి భాగమని ఆయన పేర్కొన్నారు. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.