గవర్నర్‌ ను కలిసిన డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, మహానాడు : తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతల్లో నియమితులైన సీపీ రాధాకృష్ణన్‌ను గురువారం డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క మల్లు మర్యాదపూర్వకంగా కలిసి అభినదనలు తెలిపారు. మాజీ గవర్నర్‌ తమిళిసై తన పదవికి రాజీనామా చేసిన విషయం పాఠకులకు తెలిసిందే.