Mahanaadu-Logo-PNG-Large

అభివృద్ధి, సంక్షేమం టీడీపీ సంకల్పం

కూటమి ప్రభుత్వం ఏర్పడటం శుభపరిణామం
వైసీపీ పీడ వదిలిందని ప్రజలు ఆనందపడుతున్నారు
వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు

నరసరావుపేట: జిల్లా టీడీపీ పార్లమెంట్‌ కార్యాలయంలో వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్‌ ఓడిపోయాక ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిందని ప్రజలు అనుకుం టున్నారు. అరాచక పాలనపోయి అభివృద్ధి పాలన మొదలైందని భావిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం శుభ పరిణామం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇంత భారీ విజయం లేదు. చంద్రబాబు గతంలో చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తించుకున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు ఉండాలనేదే టీడీపీ సంకల్పం. పల్నాడు జిల్లాలో ఏడు ఎమ్మెల్యేలను గెలిపించి మమ్మల్ని ప్రజలు ఆదరించారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుతో తమపై మరింత బాధ్యత పెరిగింది.

వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగినా టీడీపీ శ్రేణులు సంయమ నం పాటించాలి. జిల్లాలో గంజాయి, గుట్కాపై రెండు నెలల్లో కఠిన చర్యలు తీసుకుంటాం. వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడం మా ధ్యేయం. గతంలో జిల్లాలోని వైసీపీ నేతలు అనేక అక్రమాలకు పాల్పడ్డారు. మా ప్రభుత్వంలో జిల్లాలో శాంతి భద్రతల సమస్య ఎక్కడా రాకూడదు. దేశంలో మచ్చలేని నాయకుల్లో చంద్రబాబు ఒకరు. రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించబోతున్నారు. మా గెలుపునకు అన్ని విధాలుగా సహకరించిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు రుణపడి ఉంటాం. వైసీపీ ప్రభుత్వం చేతకానితనంతోనే రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ప్రభు త్వ కార్యాలయాలను ప్రజా పరిపాలన వేదికలుగా మారుస్తాం. అమరావతి, పోలవరంను వెంటనే పూర్తి చేస్తాం. వరికెపుడిసెలను పూర్తి చేసి పల్నాడు ప్రజల రుణం తీర్చుకుంటామని తెలిపారు.