ఇకపై నేరుగా విద్యార్థులకే కాస్మొటిక్స్

అమరావతి , మహానాడు : ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కాస్మొటిక్ వస్తువులను (పేస్ట్, బ్రష్, షాంపూ వగైరా) నేరుగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి అయ్యే మొత్తాన్ని గత ప్రభుత్వం విద్యార్థుల ఖాతాల్లో జమ చేసే విధానం తెచ్చినా సరిగా అమలు కాలేదు. దాదాపు రూ.10 కోట్ల బకాయిలున్నట్లు తేల్చింది. దీంతో ఇకపై వస్తువుల్ని విద్యార్థులకే  నేరుగా ఇవ్వాలని నిర్ణయించింది. 548 పాఠశాలల్లో 1.25 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.