ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగుల పంపిణీ

-పాల్గొన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ

ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ… మన ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావొస్తుంది, ప్రజల అవసరాలను తీరుస్తాం .మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఆయన నాయకత్వంలో మన పక్కనే ఉన్న మన రాజధాని అమరావతి అభివృద్ధితో పాటు, రాష్ట్ర అభివృద్ధి కూడా త్వరితగతిన జరుగుతుందని అన్నారు.

అలాగే విద్యా, వైద్య, అభివృద్ధి,సంక్షేమం పరంగా ఈ ప్రభుత్వం ప్రజలు ఆశించిన విధంగా ఉంటుంది అని, దానికి నిదర్శనం ఇవాళ ఈ కాలేజ్ లో పుస్తకాల పంపిణీ. కాలేజీలో ఆగిపోయిన అభివృద్ధి పనులు కానీ ఖచ్చితంగా పూర్తి చేస్తాం అని, విద్యార్థులు అందరూ బాగా చదువుకొని ఉజ్వల భవిష్యత్తు కలగాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.