వరద బాధితుల సహాయార్ధం రూ.1.50 లక్షల విరాళం

– సీఎం చంద్రబాబుకు అందజేసిన ప్రముఖులు

ఉండవల్లి, మహానాడు: వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి జీవీఆర్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్, సీఎఎమ్ఆర్ గ్రూప్ విరాళం అందించాయి. జీవీఆర్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ తరపున ఆ సంస్థ ప్రతినిధులు రామచంద్రరాజు, గంగాప్రసాద్ రూ.1 కోటి, సీఎమ్ఆర్ గ్రూప్ ఛైర్మన్ మావూరి వెంకటరమణ రూ.50 లక్షల విరాళాన్ని సీఎం చంద్రబాబు నాయుడుని శనివారం ఉండవల్లి నివాసంలో కలిసి అందించారు.