దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆకస్మిక తనిఖీ

-అయిదేళ్ల అనారోగ్యాన్ని వదిలించడమే తక్షణ కర్తవ్యం: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి  
-ప్రభుత్వ వైద్యశాల ఆకస్మిక పరిశీలన 
-వసతుల కల్పనకు కృషి చేస్తా 

దర్శి, మహానాడు: అయిదేళ్ల అనారోగ్యానికి పూర్తిస్థాయిలో చికిత్స చేయడమే కూటమి ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. అయిదేళ్ల పాటు జగన్ రెడ్డి మార్కు, కనికట్టు కేటాయింపులు, మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకాలపై శీతకన్ను, అంతు లేని అవినీతితో ప్రజారోగ్య రంగమే వెంటిలేటర్‌పై చేరిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడవన్నీ చక్కదిద్ది ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇవ్వడమే ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యతాంశంగా తీసుకుందన్నారు.

గురువారం దర్శి ప్రభుత్వ ఆసుపత్రిని గొట్టిపాటి లక్ష్మి ఆకస్మికంగా వెళ్లి పరిశీలించారు.  అన్ని విభాగాల్లో రోగులకు అందుతున్న సేవలు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో మాట్లాడి ఆస్పత్రి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.  విభాగాల వారీగా సమస్యలు, ఆస్పత్రికి కావలసిన పరికరాలు, సిబ్బంది, ఇతర వివరాలు  హాస్పిటల్ లో ఉన్న డాక్టర్ సుమన్ గారిని అడిగి తెలుసుకున్నారు.

హాస్పిటల్ కి ముఖ్యంగా మార్చురీ గది  అవసరం అని డాక్టర్ చెప్పగా ఎస్టిమేషన్ వేపించి శాంక్షన్ చెపిస్తాను అన్నారు. డెలివరికి సంబంధించిన ఎక్విప్ మెంట్  మిషనరీ అడిగారు. ఆ మిషనరీ తానే స్వయంగా ట్రస్ట్ ద్వారా సమకూరుస్తామని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ హామీ ఇచ్చారు. హాస్పిటల్లో తాగునీటి సమస్య ఉందని చెప్పగా.. RO వాటర్ ప్లాంట్ ని త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. హాస్పిటల్ లోని అన్ని విభాగాలు తానే స్వయంగా తిరిగి… క్షుణ్ణంగా పరిశీలించారు. హాస్పిటల్ లో ఎంతమంది డాక్టర్లు ఉన్నారో, ఓపీ రిజిస్టర్, స్టాఫ్ రిజిస్టర్ పరిశీలించారు.

వసతుల కల్పనకు కృషి చేస్తా 
నియోజకవర్గస్థాయి ఆసుపత్రిలా ఏమాత్రం లేదని ఒక డాక్టర్ గా నాకు ఇక్కడ వస్తువులు చూశాక ఆవేదన కలుగుతుందన్నారు.  ఒక డాక్టర్ గా నా మొదటి ప్రాధాన్యత నియోజకవర్గం పేద వర్గాలకు వైద్య వసతి కల్పించడం నా బాధ్యత అన్నారు.  ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దర్శి ఆసుపత్రి అభివృద్ధికి హామీ ఇచ్చారని తెలిపారు. ఆసుపత్రికి అవసరమైన వసతుల కల్పనకు అవసరమైన నిధులు మంజూరుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, అదేవిధంగా జిల్లా మంత్రి డోలా వీరాంజనేయులు, గొట్టిపాటి రవికుమార్, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ను కలిసి ఆసుపత్రి అభివృద్ధి చేసి ప్రజలందరికీ వైద్యం అందుబాటులోకి తేవడమే ధ్యేయమన్నారు. రోగులను అడిగి వారి బాధలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  ఆస్పత్రి ఆవరణలో వస్తువులు, మార్చరీ రూమ్ ఏర్పాటు, పరిసరాల, పరిశుభ్రత, శానిటరీ మెరుగుదల మరుగుదొడ్ల క్లీనింగ్, గ్రీనరీ ఇలా ఆసుపత్రిని సుందరంగా తీర్చిదిద్ది అన్ని రంగులతో దర్శి నియోజకవర్గ స్థాయి ఆసుపత్రిగా రూపుదిద్దుకునే విధంగా కృషి చేస్తానని వివరించారు.

ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, హాస్పిటల్ హెడ్ డాక్టర్ సుమన్ , డాక్టర్స్, దర్శి మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు