ఈనెల 18 నుంచి డీఎస్సీ పరీక్షలు

హైదరాబాద్ : తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు యథాతథంగా ఉంటాయని తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. ఈ నెల 18వ తేదీ నుంచి ఆగస్ట్ 5 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నెల 11 సాయంత్రం ఐదు గంటల నుంచి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చునని తెలిపింది. వ‌రుస‌గా పోటీ ప‌రీక్ష‌లు ఉన్న నేప‌థ్యంలో చ‌దువు కోవ‌డానికి స‌మ‌యం స‌రిపోద‌ని అభ్య‌ర్థులు అంటున్నారు. అయితే డీఎస్సీ యథాతథంగా నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.