దుబాయ్ టు ముంబై.. సముద్రంలో ట్రైన్ టన్నల్ ప్రాజెక్ట్

– పైప్ లైన్ ద్వారా ఆయిల్ – పెట్రోల్
(అన్వేష్)

ట్రైన్ గంటకు 1000 కిలో మీటర్స్ స్పీడ్ తో దుబాయ్-ముంబై మధ్య 2 గంటల ప్రయాణం. ఇది కల కాదు. ఊహ అంత కన్నా కాదు. త్వరలో సాకారం కానున్న భారీ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ పచ్చజెండా ఊపారు. మోదీ అంటే అంతే కదా? అసాధ్యాలను సుసాధ్యం చేసే విశ్వామిత్రుడు! మరి ప్రయాణం ఎంత సేపంటారా? జస్ట్ రెండంటే రెండే గంటలు. అయితే ఇది ప్రయాణీకుల కోసం కాదు.కేవలం దుబాయ్ నుంచి ఇండియాకు ఆయిల్ సరఫరా కోసమే.

దీని ప్రత్యేకత:
రైలు మార్గం క్రింద పైప్ లైన్స్ ఉంటాయి.ఇండియా నుంచి నర్మదా నది వాటర్ దుబాయ్ కి వెళుతుంది. దుబాయ్ నుంచి పైప్ లైన్ ద్వారా ఆయిల్ – పెట్రోల్ ఇండియాకి సప్లై అవుతుంది