Mahanaadu-Logo-PNG-Large

పల్నాడు డీపీవోపై విచారణకు ఈసీ ఆదేశాలు

-టీడీపీ ఫిర్యాదుతో స్పందించిన ఎన్నికల సంఘం
-ఈవీఎం ధ్వంసంపై నివేదిక ఇవ్వాలని సూచనలు

నరసరావుపేట: పల్నాడు డీపీవో విజయభాస్కర్‌రెడ్డిపై విచారణకు ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గానికి ఆయన వెబ్‌ కాస్టింగ్‌ పర్యవేక్షణాధికారిగా ఉన్నారు. పాల్వాయి గేట్‌ 202 బూత్‌లో మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృ ష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పకుండా గోప్యంగా ఉంచారు. దీంతో టీడీపీ నాయకులు ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది.