Mahanaadu-Logo-PNG-Large

కాళేశ్వరం పై కాంగ్రెస్ చేసిందంతా దుష్ప్రచారమే

– మేడిగడ్డను సందర్శించిన మాజీమంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి

మేడిగడ్డ: కాళేశ్వరం పై కాంగ్రెస్ చేసిందంతా దుష్ప్రచారమే.రైతాంగానికి అందించేందుకు పుష్కలంగా నీళ్లు ఉన్నా.. ఇంత నిర్లక్ష్యమా? ఇప్పుడు నీళ్లు ఇస్తే వాళ్ల బాగోతం బయటపడతదనే భయపడుతున్నరు. ఎన్నికల ముందు కాళేశ్వరం అంతా కొట్టుకుపోయిందని వాళ్ళు చేసిన ప్రచారమంతా తప్పని తెలిపోతుందని పంటలు ఎండపెట్టిండ్రు.

ప్రస్తుతం 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నది. గతంలో 28 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు రావడం జరిగింది. అంత ప్రవాహం ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు చెక్కుచెదరలేదు. ఒక్క గేటు కొంత కుంగితేనే కాంగ్రెస్ ఎంతో దుష్ప్రచారం చేసి రాక్షసానందం పొందింది. దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదని ఇంజనీర్లే చెపుతున్నారు.

ఇప్పుడు కూడా నీళ్లు ఇచ్చేందుకు ఎలాంటి సమస్యలేదంటున్నరు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో అభాసుపాలవువుతామని భయపడుతున్నారు. అసలు మనకు నీళ్లొచ్చే కన్నెపల్లి పంప్ హౌజ్ కాళేశ్వరానికి 20 కి.మీ పైన ఉన్నది. అది ఎప్పటికీ లిఫ్ట్ చేస్తనే ఉంటది.

సుందిళ్ళ, అన్నారంలో కొత్తగా ఏమైనా ఇబ్బందజేలొస్తాయనే ప్రచారంతో తప్పుదోవపట్టించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లకు.. మనకు నీళ్లిచ్చే కన్నెపల్లి కు ఎత్తిపోయడానికి సంబంధమే లేదు. సంబంధం లేని సాకులతో కాంగ్రెస్ రైతాంగాన్ని మోసం చేస్తుంది. కాళేశ్వరం పై చేసిన దుష్ప్రచారానికి కాంగ్రెస్ రైతగానికి క్షమాపణ చెప్పి నీళ్లను అందించాలి.