Mahanaadu-Logo-PNG-Large

ఏఎన్‌యూ కౌంటింగ్‌ కేంద్రం పరిశీలన

గుంటూరు: జిల్లాలో కౌంటింగ్‌ జరగనున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో భద్రతా ఏర్పాట్లను సోమవారం సాయంత్రం రాష్ట్ర ప్రత్యేక పోలీసు పరిశీలకులు దీపక్‌ మిశ్రా, అడిషనల్‌ డీజీ ఎస్‌.బాగ్చి పరిశీలించారు. వారి వెంట కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్‌ డూండి ఉన్నారు. కౌంటింగ్‌ సెంటర్‌, యూనివర్సిటీ ఆవరణ ప్రధాన గేటు, రహదారులపై ఏర్పాటు చేసిన బందోబస్తు పరిశీలించి సూచనలు చేశారు.