హైదరాబాద్: రామోజీరావు అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొని పాడె మోశారు. ఈ సందర్భంగా ఎక్స్లో ఆయన ట్వీట్ చేశారు. తెలుగు వెలుగు, అక్షర యోధుని అంతిమ సంస్కార కార్యక్రమంలో పాల్గొన్నాను. తెలుగువారి ఆత్మబంధువు రామోజీ గారికి కడసారి వీడ్కోలు పలికాను. హృదయం బాధతో నిండిపోయింది. ఈనాడు ఆయన మన మధ్య లేకపోయినా..ఆ మహనీయుడు ఇచ్చిన స్ఫూర్తి మార్గదర్శిగా మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఉషాకిరణాల్లాంటి ఆయన కీర్తి అనునిత్యం అజరామరమై వెలుగుతుంది అంటూ ట్వీట్ చేశారు.