లోయలో పడిన వ్యాన్..18 మంది మృతి
తునికాకు సేకరణకు వెళ్లి వస్తుండగా ఘటన
ఛతీస్గఢ్, మహానాడు : ఛత్తీస్గఢ్ రాష్ట్రం కవర్థ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది ఆదివాసీలు మృతిచెందారు. తునికాకు సేకరణ కోసం వెళుతున్న ఆదివాసీలు ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపు తప్పి 20 అడుగుల లోయ లో పడిరది. ఆ వాహనంలో 40 మంది వరకు ఉన్నట్లు స్థానికులు చెబుతు న్నారు. అందరూ తునికాకు సేకరణ ముగించుకుని తిరిగి సెమ్హార గ్రామం వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 18 మంది మృతిచెండగా వారిలో 14 మంది మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే కవర్థ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై ఛత్తీస్గఢ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజరుశర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించారు.