కోడలి మూర్ఖత్వంతో అనాథలా మామ మృతి

-ఇంటి తాళం లేక రోడ్డుపైనే శవం
-స్థానికుల సహకారంతో అంత్యక్రియలు

తిరుపతి, మహానాడు: కోడలి మూర్ఖత్వంతో మామ అనాథలా మృతిచెందిన ఘటన తిరుమలలో చోటుచేసుకుంది. తిరుమలలో గత 50 సంవత్సరాలుగా జీవిస్తున్న శ్రీనివాసులు రెడ్డి, గురమ్మ అనే దంపతులకు ఒక కుమారుడు. తన పేరు మీద ఉన్న ఆస్తిని కుమారుడి పేరు మీద రాసి శేష జీవితం సాఫీగా గడుపుదామని అనుకున్నారు. ఇంతలో విధి ఆడిన నాటకంలో కుమారుడు అనారోగ్యంతో మరణించాడు. మరణించిన వెంటనే టీటీడీ దేవస్థానం రెవెన్యూ ఆఫీసులో భర్త పేరుపై ఉన్న ఆస్తిని కోడలు పేరు మీదుగా మార్చుకుని ఇంటికి తాళం వేసుకుని తన అమ్మగారి ఇల్లు రాజమండ్రికి వెళ్లిపోయింది. దాంతో వృద్ధ దంపతులు రోడ్డుపైన జీవిస్తున్నా రు. తిండి లేక శ్రీనివాసరెడ్డి మరణించాడు. అనాధ శవంగానే పడి ఉన్నాడు. చుట్టుపక్కల వారి సహాయ సహకారాలతో అంత్యక్రియలు చేయవలసి వచ్చింది. టీటీడీ వారు వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు.