సీఎం రేవంత్‌కు 317 జీవోపై తుది నివేదిక అందజేత

హైదరాబాద్‌, మహానాడు: 317 జీవో పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన సభ్యులు, మంత్రులు డి. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు నిష్ణాతులైన మేధావులతో సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల అభిప్రాయాలను క్యాబినెట్ సబ్ కమిటీ వినతుల రూపంలో ప్రత్యక్షంగా, వెబ్సైట్ ద్వారా అప్లికేషన్స్ ను స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించి తుది నివేదిక పత్రాలను సీల్డ్ కవర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి అందజేశారు.