-రూ.5లక్షలు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే వసంత
మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన శెట్టిపల్లి కృష్ణారెడ్డి (43) గారు ఇటీవల ప్రమాదవశాత్తు అదే గ్రామంలోని జమ్మడుగు వాగులో వరదనీటిలో పడి మృతి చెందాడు. మృతుని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మంజూరైంది. స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు శుక్రవారం వెల్వడం గ్రామంలో మృతుని నివాసానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మీ కష్టం మరెవ్వరికీ రాకూడదని అన్నారు. మృతుని కుటుంబ సభ్యులకు రూ.5లక్షల చెక్కును అందజేశారు. మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) , స్థానిక ఎన్డీఏ మహాకూటమి నాయకులు పాల్గొన్నారు.