క‌విత‌ను క‌లిసిన మాజీ మంత్రులు

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయి తిహార్‌ జైల్లో ఉన్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ క‌లిశారు. ఈరోజు ఉదయం ఢిల్లీలోని తీహార్‌ జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు.. కవితతో ములాఖాత్‌ అయ్యారు. క‌విత‌ను క‌లిసి ప‌రామ‌ర్శించారు. ఆమె యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఢిల్లీ మద్యం కేసులో కవితను ఈడీ అరెస్ట్‌ చేయగా ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు తిహార్‌ జైలుకు వెళ్లి ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పి వస్తున్నారు.  అలాగే రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా క‌విత‌తో ములాఖాత్ అయిన విష‌యం తెలిసిందే.