Mahanaadu-Logo-PNG-Large

గుంటూరు పశ్చిమలో గల్లా మాధవి ఘనవిజయం

గుంటూరు: పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి సార్వత్రిక ఎన్నికల్లో 51,160 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పోలైన 1,88,519 ఓట్లలో గల్లా మాధవికి 1,16,067, వైసీపీ అభ్యర్థి విడదల రజినికి 64,917 ఓట్లు పడ్డాయి. రిటర్నింగ్‌ అధికారి నుంచి ఆమె డిక్లరేషన్‌ పత్రాన్ని అందుకున్నారు.

డిక్లరేషన్‌ పత్రాలు అందుకున్న జీవీ
వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు 30267 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. తన సహచర నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఆర్వో, తహసీల్దారు చేతులమీదుగా డిక్లరేషన్‌ ఫారం అందుకున్నారు.