Mahanaadu-Logo-PNG-Large

“గం..గం..గణేశా” సెకండ్ సింగిల్ ‘పిచ్చిగా నచ్చాశావే’ రిలీజ్

“బేబి” వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమా “గం..గం..గణేశా”. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ దేవరకొండ తన కెరీర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది కావడం విశేషం. ఈ నెల 31న “గం..గం..గణేశా” సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. “గం..గం..గణేశా” సెకండ్ సింగిల్ ‘పిచ్చిగా నచ్చాశావే’ ను మల్లారెడ్డి కాలేజ్ విద్యార్థుల సందడి మధ్య రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ నయన్ సారిక, నిర్మాత వంశీ కారుమంచి, డైరెక్టర్ ఉదయ్ శెట్టి, మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్, నటుడు కృష్ణ చైతన్య, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, లిరిసిస్ట్ సురేష్ బనిశెట్టి, సింగర్ అనురాగ్ కులకర్ణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత వంశీ కారుమంచి మాట్లాడుతూ – మీ అందరినీ చూస్తుంటే నేను చెన్నైలో చదువుకున్న రోజులు గుర్తొస్తున్నాయి. ఆనంద్ దేవరకొండ మంచి ఫ్రెండ్, రియల్ లైఫ్ లోనూ హీరో. “గం..గం..గణేశా” సినిమాలో ఆనంద్ క్యారెక్టర్ మీ రియల్ లైఫ్ లో ఫ్రెండ్ క్యారెక్టర్ లా ఉంటుంది. మే 31న మీ ముందుకు వస్తున్నాం. మూవీని తప్పకుండా చూడండి. అన్నారు. దర్శకుడు ఉదయ్ శెట్టి మాట్లాడుతూ – “గం..గం..గణేశా” ఒక మంచి క్రైమ్ కామెడీ మూవీ. మీరు మీ ఫ్యామిలీస్ తో కలిసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. మా మూవీని మిస్ కాకండి. అన్నారు. హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ – నేను కొన్నేళ్ల కిందట స్పోర్ట్స్ ఆడేందుకు మీ కాలేజ్ కు వచ్చాను. ఇంత పెద్ద కాలేజ్ చూసి ఆశ్చర్యపోయాను. మన సొసైటీకి రేపటి ఫ్యూచర్ మీరే. మీలో చాలా మంది బాగా చదువుకుని విదేశాల్లో ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారని విన్నాను. మీ అందరి సమక్షంలో మా “గం..గం..గణేశా” సినిమా పిచ్చిగా నచ్చాశావే సాంగ్ రిలీజ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. బేబి సినిమాలో ఎంత ఏడ్చారో ఈ సినిమాలో నన్ను చూసి అంత నవ్వుతారు. మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమాలో బొంబాయి చట్నీ చేసిన కుర్రాడిగా, విజయ్ దేవరకొండ తమ్ముడిగానే తెలుసు. బేబి సినిమాతో ఆనంద్ దేవరకొండగా గుర్తింపు తెచ్చుకున్నాను. నా స్టోరీ సెలక్షన్స్ బాగుంటాయని చెబుతుంటారు. “గం..గం..గణేశా”లో స్క్రిప్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. ట్విస్ట్స్, టర్న్స్ ఉంటాయి. క్రైమ్, కామెడీ, యాక్షన్ తో మీరంతా ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు. మే 31న థియేటర్స్ కు వెళ్లండి. చేతన్ భరద్వాజ్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. ఆర్ ఎక్స్ 100, ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాలకు చేతన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలోనూ బృందావనివే వంటి ఛాట్ బస్టర్ అందించాడు. అనురాగ్ కులకర్ణి నాకు అమేజింగ్ సాంగ్స్ పాడాడు. బేబిలో ప్రేమిస్తున్నా సాంగ్ ను సురేష్ బనిశెట్టి అన్న రాశారు. ఈ పిచ్చిగా నచ్చాశావే సాంగ్ కూడా బ్యూటిఫుల్ గా రాశారు. ఉదయ్ శెట్టి నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్ట్ తో ఓపికగా ట్రావెల్ చేస్తూ ఎంతో కష్టపడి సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నాడు. మనకు ఒక బ్రిలియంట్ డైరెక్టర్ అవుతాడు. అన్నారు.