రేపు స్కూళ్ళకు సెలవు ఇవ్వండి: చంద్రబాబు

అమరావతి, మహానాడు: రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళకు రేపు సెలవు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారం ఆదేశించారు. వర్షాలు వరదల్లో తొమ్మిది మంది చనిపోవడం బాధాకరం అని అన్నారు. ఇప్పటికే చాలా వరకు వర్షాలు తగ్గాయని, కానీ వరద ముప్పు ఉందని చెప్పారు. ఎల్లుండి లోగా వర్షాలు తగ్గుతాయని పేర్కొన్నారు. కృష్ణ, గుంటూరు జిల్లాలో అసాధారణ వర్షపాతం నమోదు అయిందని 37 సెం.మీవరకు వర్షం కురిసింది అని సీఎం తెలిపారు.