రూ.50 వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు
మూడు రాష్ట్రాలను పరిశీలిస్తున్న కేంద్ర సంస్థ
ఆంధ్రప్రదేశ్లో సానుకూల అంశాలపై పరిశీలన
ప్రముఖ పత్రికలో కథనంపై నిరుద్యోగుల్లో ఆశలు
అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వేళ రాష్ట్రానికి శుభవార్త అందుతోంది. రాష్ట్రంలో భారీ రిఫైనరీ ప్రాజెక్టు ప్రారంభానికి బీపీసీఎల్ పరిశీలి స్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏడాదికి 12 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న రిఫైనరీ నెలకొల్పాలని బీపీసీఎల్ భావిస్తోందని, ఈ ప్రాజెక్టు కోసం 50 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. అయి తే ఈ రిఫైనరీ నెలకొల్పేందుకు మూడు రాష్ట్రాలను బీపీసీఎల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో ఒకచోట ప్రారం భించాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. పెరుగుతున్న ఇంధన డిమాండ్ను తీర్చడా నికి భారతదేశానికి మరిన్ని రిఫైనరీలు అవసరం ఉంది. అందులో భాగంగా బీపీసీఎల్ తూర్పు తీరంలో లేదా పశ్చిమ తీరంలో మరొక రిఫైనరీని ప్లాన్ చేస్తోంది.
చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి అని ఒక అధికారి చెప్పినట్లు ఎకనమిక్స్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. మరోవైపు బీపీసీఎల్ చైర్మన్ కృష్ణ కుమార్ సైతం ఇటీవల ఇదే విషయంపై మాట్లాడారు. 2029 నాటికి బీపీసీఎల్ తన సామర్థ్యాన్ని 45 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం బీపీసీఎల్కు ముంబై, కోచి, మధ్యప్రదేశ్లోని బినాలో రిఫైనరీలు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు కోసం తూర్పు తీర ప్రాంతం, పశ్చిమ తీరప్రాంతాలను బీపీసీఎల్ పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే ఆంధ్ర ప్రదేశ్లో ఏర్పాటు చేసే ఆలోచనలు సైతం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఎకనమిక్స్ టైమ్స్ ప్రచురించిన ఈ కథనం సోషల్ మీడియాలో చక్కర్లు కొడు తోంది. ఆ భారీ ప్రాజెక్టు ఏపీకి రావాలని వార్త తెలిసిన వెంటనే నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ వార్తను షేర్ చేస్తున్న టీడీపీ కూటమి శ్రేణులు.. ఏపీకి స్వర్ణయుగం మొదలుకాబోతోందంటూ పోస్టులు పెడుతున్నారు. 50 వేల కోట్ల పెట్టుబడి ఒకేసారి వస్తే స్థానికులకు భారీగా ఉద్యోగాలు లభిస్తాయని, వేల మందికి పరోక్షంగా లబ్ధి కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ భారీ ప్రాజెక్టును ఏ మేరకు ఏపీకి తీసుకువస్తారనేదీ చూడాలి మరి.