రైల్వే శాఖ శుభవార్త

ఏపీ ప్రజలకు కేంద్రం శుభవార్త వినిపించింది.. రాష్ట్రం లోని గూడూరు-రేణిగుంట మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

ప్రధాన మంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఈ రైల్వే లైన్ నిర్మించ బోతున్నారు. ఈ రెండు స్టేషన్ల మధ్య 83.17 కిలో మీటర్ల దూరం ఉంది.

నిర్మాణంలో భాగంగా 36.5 హెక్టార్ల భూమిని సేకరించ బోతున్నారు. ఈ లైను అందుబాటు లోకి వస్తే తిరుపతి వెళ్లే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది..