టెక్టోరో కు గూగుల్ గ్రోత్ యాక్సిలరేటర్ అవార్డు

లండన్ లో అవార్డు స్వీకరించిన  ఎం డీ శ్రీధర్ దన్నపనేని

హైదరాబాద్, జూన్ 21: మహానాడు : ఆండ్రాయిడ్ ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్‌ల విస్తరణ, సమీకృతంలో  విశేషమైన సహకారం అందించినందుకు గూగుల్ నుండి టెక్టోరో కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిష్టాత్మక గ్రోత్ యాక్సిలరేటర్ అవార్డును అందుకుంది. లండన్‌లో జరిగిన   ఆండ్రాయిడ్ ఎంటర్‌ప్రైజ్ గ్లోబల్ పార్టనర్ సమ్మిట్ 2024లో ఈ అవార్డును టెక్టోరో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ దన్నపనేని అందుకున్నారు.

ఈ సందర్భంగా  టెక్టోరో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ దన్నపనేనిమాట్లాడుతూ  “గ్రోత్ యాక్సిలరేటర్ అవార్డును అందుకోవడం  గర్వంగా ఉంది. ఈ గుర్తింపు మా అంకితభావంతో కూడిన బృందం యొక్క కృషి, పట్టుదల,  ఆండ్రాయిడ్ అడాప్షన్‌ను డ్రైవింగ్ చేయడంలో  ఎడతెగని మా శ్రమకు, సాధనకు నిదర్శనం.ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్  ఆధారిత ఆండ్రాయిడ్ కస్టమర్ అనుభవం, కార్యాచరణ సామర్థ్యం  బలమైన భద్రతపై  దృష్టి ఈ మైలురాయిని సాధించడంలో కీలకమైనవని అన్నారు.

మా భాగస్వాముల పురోగతికి  నిబద్దతతో పని చేస్తామని శ్రీధర్ చెప్పారు.  మా సామర్ధ్యాన్ని మెరుగు పరుచుకునేందుకు అత్యాధునిక ఏ ఐ సాంకేతికతను తాము వినియోగిస్తున్నామని తెలిపారు. ఈ అవార్డు వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.