లండన్ లో అవార్డు స్వీకరించిన ఎం డీ శ్రీధర్ దన్నపనేని
హైదరాబాద్, జూన్ 21: మహానాడు : ఆండ్రాయిడ్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్ల విస్తరణ, సమీకృతంలో విశేషమైన సహకారం అందించినందుకు గూగుల్ నుండి టెక్టోరో కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిష్టాత్మక గ్రోత్ యాక్సిలరేటర్ అవార్డును అందుకుంది. లండన్లో జరిగిన ఆండ్రాయిడ్ ఎంటర్ప్రైజ్ గ్లోబల్ పార్టనర్ సమ్మిట్ 2024లో ఈ అవార్డును టెక్టోరో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ దన్నపనేని అందుకున్నారు.
ఈ సందర్భంగా టెక్టోరో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ దన్నపనేనిమాట్లాడుతూ “గ్రోత్ యాక్సిలరేటర్ అవార్డును అందుకోవడం గర్వంగా ఉంది. ఈ గుర్తింపు మా అంకితభావంతో కూడిన బృందం యొక్క కృషి, పట్టుదల, ఆండ్రాయిడ్ అడాప్షన్ను డ్రైవింగ్ చేయడంలో ఎడతెగని మా శ్రమకు, సాధనకు నిదర్శనం.ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత ఆండ్రాయిడ్ కస్టమర్ అనుభవం, కార్యాచరణ సామర్థ్యం బలమైన భద్రతపై దృష్టి ఈ మైలురాయిని సాధించడంలో కీలకమైనవని అన్నారు.
మా భాగస్వాముల పురోగతికి నిబద్దతతో పని చేస్తామని శ్రీధర్ చెప్పారు. మా సామర్ధ్యాన్ని మెరుగు పరుచుకునేందుకు అత్యాధునిక ఏ ఐ సాంకేతికతను తాము వినియోగిస్తున్నామని తెలిపారు. ఈ అవార్డు వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.