గవర్నర్ ప్రసంగం మొత్తం అబద్ధాలు.. అభూత కల్పనలు.. అర్థసత్యాలు

– గవర్నర్ ప్రసంగం అంతా అంకెల గారడీ, అభూత కల్పనలు, అసత్యాలు, అర్థసత్యాల మయమన్న టీడీపీ
– శానససభ, శాసనమండలి నుంచి వాకౌట్ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
– ఎన్నికల ముందు గవర్నర్ ద్వారా ప్రజల్ని మోసగించడానికి జగన్ రెడ్డి మరోసారి ప్రయత్నించాడని ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగుదేశం సభ్యులు
• ధన్యవాదాలు తెలిపే అంశంపై ప్రజలకు వాస్తవాలు చెప్పి, గవర్నర్ ప్రసంగంలోని తప్పుల్ని ఎత్తిచూపుతామన్న నేతలు

గవర్నర్ ప్రసంగం ద్వారా లేనిదాన్ని ఉన్నట్టుగా భూతద్దంలో చూపే ప్రయత్నం చేశారు : గోరంట్ల బుచ్చయ్య చౌదరి
“గవర్నర్ ప్రసంగం మొత్తం ఒక నిస్సారమైన, నిస్తేజమైన పాలకుల విధానాలకు మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నంగా సాగింది. ఒక గోబెల్స్ ప్రచారాన్ని తలపించింది. పాలనలో అన్ని విధాలా విఫలమైన ప్రభుత్వం, అంకెలగారడీ చేసి, గవర్నర్ ప్రసంగం ద్వారా లేనిదాన్ని ఉన్నట్టుగా భూతద్దంలో చూపే ప్రయత్నం చేసింది. 36 పేజీల గవర్నర్ ప్రసంగంలో వాస్తవ పరిస్థితులు ప్రజల ముందు ఉంచడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.

అన్నిరంగాల్లో ఫెయిల్యూర్సే. రాష్ట్ట్రాన్ని అప్పుల మయం చేసి, అప్పుల్లో దేశంలోనే నంబర్ – 1 గా నిలిపారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ముందు ముఖ్యమైన గవర్నర్ ప్రసంగంలో పోలవరం, రాజధాని అంశాల్లో జరిగినమోసం, రైతులు.. నిరుద్యోగులు.. యువతకు చేసిన దగా, దళితులు, బడుగు, బలహీనవర్గాలకు అందించే రాయితీల్లో చేసిన దగా లాంటి కీలకాంశాలు లేవు. కేంద్రప్రభుత్వం అందించే పథకాలకు జగనన్న, వైఎస్సార్ అని పేర్లు పెట్టి పబ్బం గడుపుకుంటున్నారు. విద్య, వైద్య రంగ ప్రమా ణాలు దారుణంగా పడిపోయాయి. రాష్ట్రంలో దోపిడీ పెరిగింది..ధరలు పెరిగాయి.

98శాతం హామీలు నెరవేర్చాను.. 175 స్థానాల్లో గెలిపించండి అనే అర్హత ఈ ముఖ్యమంత్రికి లేదు గవర్నర్ ప్రసంగంలో గతప్రభుత్వ పథకాల పేర్లు మార్చి, అంకెలు అటూఇటూ మార్చి చెప్పారు
ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానాన్ని ఈ ముఖ్యమంత్రి నెరవేర్చ లేదు. 98శాతం హామీలు చేశాను.. 175 స్థానాల్లో గెలిపించండి అనే అర్హత ఈ ముఖ్యమంత్రికి లేదు. గవర్నర్ కూడా నీళ్లు నములుతూ, చెప్పలేక చెప్పలేక దగ్గుతూ అబద్ధాలు చెప్పారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో వాస్తవాలన్నీ గవర్నర్ కు కూడా తెలుసు. ఈ ముఖ్యమంత్రి నిర్వాకంతో రాష్ట్ర పరువు ప్రతిష్టలు గంగలో కలిశాయి. తన కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు దాడులు పెరిగిపోయాయి. ఎటుచూసినా శాంతి భద్రతలు మచ్చుకైనా లేవు.

నీటిపారుదల రంగం కునారిల్లిపోయింది. గవర్నర్ ప్రసంగంలో గత ప్రభుత్వంలో అమలైన పథకాల పేర్లుమార్చి, వాటికే అటూ ఇటూ అంకెలు మార్చి చెప్పించే ప్రయత్నం చేశారు. ఈ ముఖ్యమంత్రి నిర్వాకంతో రాష్ట్రం సర్వనాశనమైంది. గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు విరుద్ధంగా ఉంది. ప్రభుత్వం ఆయనతో అలా చెప్పించింది. వాళ్లు ఇచ్చింది గవర్నర్ చదివారు. ఇచ్చింది చదవలేక నాలుగుసార్లు మంచినీళ్లు తాగారు. గవర్నర్ తోనే నీళ్లు తాగించిన ఘనత ఈ ముఖ్యమంత్రిది. ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసర మా? నోటొకొచ్చినట్టు హామీలిచ్చి నవరత్నాలుగా మార్చి, 98శాతం అన్నీ అమలు చేశానంటే ఎవరు నమ్మేది? ఈ ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా ఫెయిల్ అయ్యింది అనేది కాదనలేని వాస్తవం.” అని బుచ్చయ్య చౌదరి తేల్చిచెప్పారు.

వాస్తవ పరిస్థితులకు… గవర్నర్ ప్రసంగానికి, లోయకు.. ఎవరెస్ట్ శిఖరానికి ఉన్నంత తేడా ఉంది : నిమ్మల రామానాయుడు
“ గవర్నర్ ప్రసంగం అంతా తప్పుల తడకే. పాదయాత్రలో ఎలాగైతే జగన్ రెడ్డి అబద్ధాలు, అసత్యాలు చెప్పి అధికారంలోకి వచ్చాడో, అదే విధంగా నేడు ముఖ్య మంత్రిగా ఉండి గవర్నర్ తో కూడా అలానే అబద్ధాలు చెప్పించాడు. అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరానికి, దాని దిగువన ఉండే లోయకు మధ్య ఎంతదూరం ఉంటుందో, అదేవిధంగా వాస్తవాలకు, గవర్నర్ ప్రసంగానికి మధ్య తేడా ఉంది. నిస్సిగ్గుగా అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ తో ఈ ప్రభుత్వం అసత్యాలు పలికించింది.

ఎన్నికల ముందు ప్రజల్ని మోసగించడానికి జగన్ రెడ్డి, ఏకంగా గవర్నర్నే వినియోగించుకోవడం సిగ్గుచేటు అమ్మఒడి పథకం సాయం అందుకునే తల్లులు 43.61 లక్షల మంది అయినప్పుడు విద్యార్థులు 83లక్షలు ఎలా అయ్యారో జగన్ రెడ్డి చెప్పాలి
నాడు-నేడు పథకం గురించి గవర్నర్ తో గొప్పగా చెప్పించారు. వాస్తవంలో మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రాథమిక పాఠశాలలు మూతపడి లక్ష లాది మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారు. దళిత, బడుగుబలహీన వర్గాల పిల్లలకు ప్రాథమికవిద్యను ప్రభుత్వం అందుబాటులో లేకుండా చేసింది. అమ్మఒడి గురించి కూడా అబద్ధాలు చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో 43.61 లక్షల మంది తల్లులకు అమ్మఒడి కింద ఆర్థికసాయం అందిస్తున్నట్టు చెప్పారు. 83లక్షల మంది పిల్లలకు లబ్ధి కలుగుతోందని చెప్పించారు. అమ్మఒడి కింద ఏటా ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అందరికీ రూ.15వేల చొప్పున ఇస్తాన న్నాడు.

తీరా అధికారంలోకి వచ్చాక ఇంటికి ఒక్కరికే అన్నాడు. రూ.15 వేలను ఇప్పుడు రూ.13వేలు చేశాడు. ఆ సొమ్ముకూడా అందరికీ సక్రమంగా ఇవ్వడం లేదు. 43లక్షల తల్లులకు ఇస్తున్నప్పుడు బిడ్డలు కూడా 43లక్షలే ఉండాలి. 83లక్షల మంది ఎలాఅయ్యారు? ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎన్నికల ముందు మరోసారి మోసగించడానికి ఏకంగా ఈ ముఖ్యమంత్రి గవర్నర్నే వినియోగిం చుకోవడం సిగ్గుచేటు. ఫీజు రీయింబర్స్ మెంట్ అద్భుతంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. జగనన్న విద్యాదీవెన అని పేరుమార్చి, ఒకసారి కాకుండా నాలుగుసార్లు రీయింబర్స్ మెంట్ సొమ్ము ఇస్తున్నారు.

సంవత్సరంలో నాలుగుసార్లు ఇస్తూ, 4 సార్లు పత్రికల్లో భారీ ప్రకటనలు ఇస్తూ, ప్రజలసొమ్ముతో ప్రచారం చేసుకుంటున్నారు. నాలుగో విడత ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ము ఎగ్గొట్టడంతో విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వమని కళాశాల యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. చదువులు మధ్యలో ఆగిపోయే పరిస్థితి రావడంతో విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

విదేశీ విద్య పథకానికి పేరుమార్చడం తప్ప, దళిత.. బీసీ.. మైనారిటీ విద్యార్థులకు జగన్ రెడ్డి రూపాయి ఇచ్చిందిలేదు
విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేశారు. అంబేద్కర్ విదేశీ విద్య అనే పేరుతీసేసి, జగనన్న విదేశీ విద్య అని ముఖ్యమంత్రి తన పేరు పెట్టుకున్నాడు. పేరు మార్చడంతో పాటు దళితులు, బీసీలు, మైనారిటీల విద్యార్థులకు పథకం కింద నిధులు ఇవ్వడం ఆపేశాడు. విదేశాలకు వెళ్లి చదువుకో కుండా వారి ఆశలపై నీళ్లు చల్లాడు.

అలానే ఈప్రభుత్వంలో ఎస్సీకార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్ ఏవీ లేవు. చంద్రబాబు హాయాంలో కాపులు, బ్రాహ్మణలు, వైశ్యులకుకూడా కార్పొరేషన్లు పెడితే, జగన్ ఒక్క కార్పొరేషన్ కూడా లేకుండా చేశాడు. ఉన్న కార్పొరేషన్ల ద్వారా ఆయా వర్గాల్లో ఒక్కరికి కూడా రూపాయి అదనంగా ప్రభుత్వం ఇచ్చిందిలేదు. కానీ గవర్నర్ ప్రసంగంలో నిధులు ఇస్తున్నట్టు చెప్పించారు.

గవర్నర్ ప్రసంగంలో కౌలురైతుల ప్రస్తావన లేదు. కౌలురైతుల్ని మర్చిపోయిన ఈ ప్రభుత్వానికి రైతుల గురించి మాట్లాడే అర్హతలేదు జగన్ జే ట్యాక్స్ కట్టలేక ఆక్వారైతులు హాలిడే తీసుకున్నారు
రైతుభరోసా కింద ఏటా ప్రతి రైతుకి రూ.13,500లు ఇస్తున్నట్టు గవర్నర్ తో చెప్పించారు. కేంద్రం ఇచ్చే సొమ్ముని ముఖ్యమంత్రి తన గొప్పగా చెప్పుకుంటు న్నాడు. గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా కౌలు రైతుల ప్రస్తావన లేదు. జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాల వల్లే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలో రెండోస్థానంలో ఉంది. ఇన్ పుట్ సబ్సిడీ, పంటలబీమా గురించి ప్రసంగంలో చెప్పించారు. రైతుల తరుపున పంటల బీమాసొమ్ము కట్టడమనేదే ఈ ప్రభుత్వం మర్చిపోయింది.

గతంలో చంద్రబాబు అసెంబ్లీలో కూర్చొని నిరసన తెలిపితే, అప్పుడు అర్థరాత్రి ఆ సంవత్సరానికి బీమా సొమ్ము కట్టారు. తర్వాత నుంచీ మరలా మామూలే. కౌలురైతుని మరిచిపోయిన ఈ ప్రభుత్వానికి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు. ఆంధ్రాని ఆక్వాహబ్ గా మార్చామని చెప్పుకుంటుంటే నవ్వాలో జాలిపడాలో తెలియడం లేదు. జగన్ జే ట్యాక్స్ దెబ్బకు ఆంధ్రావ్యాప్తంగా ఆక్వారైతులు హాలిడే తీసుకున్నారు.

61వేల మంది ఆక్వారైతులకు విద్యుత్ సబ్సిడీ ఇచ్చినట్టు గవర్నర్ ప్రసంగంలో చెప్పించారు. రాష్ట్రంలో 40 నుంచి 50లక్షల మంది ఆక్వా రైతులుంటే, వారిలో 60వేల మందికి ఇస్తే, ఆక్వారంగం మొత్తానికి ఇచ్చినట్టా? ఆక్వారంగానికి సంబంధించి విద్యుత్ సబ్సిడీ తీసేసింది కాక, గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు చెప్పిస్తారా?

5 ఏళ్లలో 25లక్షల ఇళ్లు కట్టిస్తానన్న జగన్ రెడ్డి, ఆఖరికి చంద్రబాబు కట్టించిన ఇళ్లు కూడా పేదలకు ఇవ్వలేదు
పేదలకు ఇళ్లు అంటూ ఎన్నికలకు ముందు కథలు చెప్పారు. అధికారంలోకి రాగానే సంవత్సరానికి 5లక్షల చొప్పున 5 ఏళ్లలో పేదలకోసం 25లక్షల ఇళ్లు నిర్మిస్తానని జగన్ రెడ్డే తన మేనిఫెస్టోలో చెప్పాడు. 5 ఏళ్లు పూర్తయ్యాయి. 25 లక్షల ఇళ్లు కట్టాల్సింది. .కనీసం వేలల్లో కూడా కట్టలేదు. ఇళ్లు కట్టకపోతే కట్టక పోయాడు.. చంద్రబాబు తన హాయాంలో పేదలకోసం కట్టించిన ఎన్టీఆర్ టిడ్కో ఇళ్లు కూడా పేదలకు ఇవ్వకుండా కక్షసాధింపులకు పాల్పడ్డాడు.

24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని చెప్పుకోవడం పచ్చి అబద్ధం కాదా? 8సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి, కరెంట్ లేకుండా చేస్తున్నారని ప్రజలు ఈ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు
24 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ ప్రజలకు అందిస్తున్నట్టు గవర్నర్ తో చెప్పించారు. విద్యుత్ డిస్కంలను అప్పుల ఊబిలోకి నెట్టిన ఈ ముఖ్యమంత్రి, 8 సార్లు ప్రజలపై విద్యుత్ ఛార్జీలు పెంచాడు. నాణ్యమైన కరెంట్ కాదు… అసలు కరెంట్ ఎప్పుడు వస్తుంది.. ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి. ఒకపక్క ప్రజలు విద్యుత్ కోతలు, పెంచిన ఛార్జీలపై ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తుంటే, గవర్నర్ తో 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ ను తక్కువ ధరకు అందిస్తున్నట్టు అబద్ధాలు చెప్పిస్తారా?

గుంతలు లేకుండా 3వేల కిలోమీటర్లు రోడ్లు వేసినట్టు జగన్ రెడ్డి, గవర్నర్ ప్రసంగంలో చెప్పించి 8వ వింత సృష్టించాడు
జగన్ రెడ్డి రాష్ట్రంలో 8వ వింత సృష్టించాడు. గుంతలు లేకుండా 3వేల కిలోమీటర్ల రోడ్లు వేశామని గవర్నర్ తో చెప్పించారు. మరీ ఇంత అబద్ధమా? జగన్ రెడ్డి శ్రేయోభిలాషి అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవలే ఏపీలో రోడ్లపై తిరిగి నడుములు పడిపోయాయని చెప్పారు. వాస్తవంలో పరిస్థితి దారుణంగా ఉంటే, గుంతలు లేని రోడ్లు వేశామని గవర్నర్ తో చెప్పించండం సిగ్గుచేటు. ఇన్ని అబద్ధాలు, అసత్యాలు వినలేకనే గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి బయటకు వచ్చేశాం.

బీఏసీ సమావేశాన్ని కూడా మేం బహిష్కరించాం. బీఏసీ సమావేశంల లో చెప్పేవి ఏవీ అసెంబ్లీలో అమలు కావడంలేదు. ప్రతిపక్ష సభ్యులకు మైక్ కూడా ఇవ్వనీయకుండా జగన్ రెడ్డి శాసనసభను లోటస్ పాండ్ లా మార్చి, నియంత్రత్వ పాలన సాగిస్తున్నాడు. ఈ రోజు ఉదయం 10గంటలకు అసెంబ్లీ ప్రారంభం కావాలి.. కానీ ముఖ్యమంత్రి రాకకోసం 15 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభించారు. శాసనసభ అంటే గౌరవం లేని ఇలాంటి ముఖ్యమంత్రిని దేశంలో ఎప్పుడూ చూడలేదు. రాష్ట్రాన్ని ఎలాగైతే నాశనం చేశాడో, అదేవిధంగా అసెంబ్లీని కూడా భ్రష్టుపట్టించాడు.” అని రామానాయడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఒక్క మత్స్యకార కుటుంబానికైనా రూ.10లక్షల పరిహారం ఇచ్చినట్టు ముఖ్యమంత్రి నిరూపిస్తే, రాజకీయ సన్యాసం తీసుకుంటా : బెందాళం అశోక్
“ ఏపీ అసెంబ్లీకి సంబంధించి జరుగుతున్న ఆఖరి సమావేశాల్లో జగన్ రెడ్డి తన మోసపూరిత చర్యలను, చేతగానితనాన్ని గవర్నర్ ప్రసంగం ద్వారా కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. గవర్నర్ తో ముఖ్యమంత్రి సత్యదూరమైన అంశాలు చెప్పిం చాడు. మత్స్యకారుల్ని తానేదో ఉద్ధరించినట్టు గవర్నర్ తో చెప్పించారు. మత్స్య కార భరోసా గతంలో కంటే ఎక్కువగా ఇప్పుడు రూ.10 వేలు ఇస్తున్నట్టు జగన్ రెడ్డి చెప్పించారు. గతంలో టీడీపీప్రభుత్వం ఒక మత్స్యకార కుటుంబంలో ఎంత మంది ఉంటే అందరికీ భరోసా కింద రూ.4వేలు (ఒక్కొక్కరికీ) అందించింది.

జగన్ రెడ్డి మాత్రం ఒక కుటుంబంలో ఒకరికే మత్స్యకార భరోసా సాయం అందిస్తున్నా డు. ఆ విషయం గవర్నర్ ప్రసంగంలో ఎక్కడాలేదు. దురదృష్టవశాత్తూ మత్స్యకా రులు చనిపోతే, వారి కుటుంబానికి ఇచ్చే ఎక్స్ గ్రేషియాను రూ.10లక్షలకు పెంచినట్టు జగన్ రెడ్డి చెప్పించారు. నా నియోజకవర్గం ఇచ్చాపురంలో ఎక్కువ మంది మత్స్యకారులే. ఇన్నేళ్లలో జగన్ రెడ్డి నా నియోజకవర్గంలో ఒక్క కుటుంబానికైనా రూ.10లక్షలు ఇచ్చినట్టు, ఒక్క క్లెయిమ్ అయినా పరిష్కరించి నట్టు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఇలా అన్నీ అబద్ధాలే.

అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లలో ఉత్తరాంధ్రలో కేవలం 2 బహిరంగసభలు మాత్రమే పెట్టిన జగన్ రెడ్డి, మొన్న నిర్వహించిన ప్రచారసభలో కూడా ఆ ప్రాంత సాగునీటి ప్రాజెక్టులు గురించి మాట్లాడలేదు. వంశధారనదిని బాహుదా నదికి అనుసంధానిస్తూ చేపట్టిన ప్రాజెక్ట్ పూర్తయితే 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడుతుందని జగన్మోహన్ రెడ్డికి తెలియదా? గతప్రభుత్వం చంద్రబాబు హయాంలో రూ.600 కోట్లతో డీపీఆర్ లు సిద్ధంచేసిన ప్రాజెక్టుల్ని కూడా జగన్ ఆపేయించి, ఉత్తరాంధ్ర రైతులకు తీరని అన్యాయం చేశాడు. శాంతి భద్రతలపై కూడా గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారు.

విశాఖపట్నంలో తహసీల్దార్ ను చంపేస్తే ఈ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సభలో గవర్నర్ మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టడం, బల్లలు చరవడం కాదు చేయాల్సింది. ముఖ్య మంత్రి ప్రజల్లోకి వెళ్తే వారి కష్టాలు, బాధలు ఏంటో తెలుస్తాయి. ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్న జగన్ రెడ్డిని వారు విశ్వసించే పరిస్థితి లేదు. గవర్నర్ ప్రసంగం ఆద్యంతం అసత్యాలతో నిండి ఉన్నందునే తామంతా సభల్ని బహిష్కరించాం. ” అని అశోక్ స్పష్టం చేశారు.

గవర్నర్ వ్యవస్థను ముఖ్యమంత్రి ఏ విధంగా దుర్వినియోగం చేశాడో, ఎంతగా అపహాస్యం చెప్పాడో చెప్పడానికి గవర్నర్ ప్రసంగమే నిదర్శనం : బీ.టీ.నాయుడు
“శాసనమండలి తరుపున టీడీపీ సభ్యులందరం సభకు హాజరై గవర్నర్ ప్రసంగం విన్నాం. గవర్నర్ వ్యవస్థను ఈ ముఖ్యమంత్రి ఏవిధంగా దుర్విని యోగం చేశాడు.. ఎంతగా అపహాస్యం చేశాడో నేటి గవర్నర్ ప్రసంగమే నిదర్శనం. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అన్నీ అబద్ధాలు చెబుతుంటే, ముఖ్యమంత్రేమో ఏదో సాధించినట్టు బల్లలు చరుస్తున్నాడు. ముఖ్యమంత్రి ఈ విధంగా ఒక కొత్త ట్రెండ్ సృష్టించాడు. బడ్జెట్ సమావేశాలు అంటే 5కోట్ల మంది రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచంలోని తెలుగువారు కూడా ఆసక్తిగా గమనిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ తో చెప్పించిన అబద్ధాలు విన్నాక అందరూ కిందపడి గిలగిల కొట్టుకునే పరిస్థితి.

బరితెగించి అవాస్తవాలు చెబుతున్నారనే తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం నేటి సమావేశాల్ని బాయ్ కాట్ చేసింది
ఏ ప్రభుత్వమైన విద్య, వైద్యరంగాలను ప్రోత్సహిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రాథమికవిద్యను లేకుండా చేసింది. పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర విద్యా ర్థులే దేశంలో చాలాతక్కువ ప్రతిభ చూపారు. ఎక్కువ మంది ఉత్తీర్ణులైతే తర్వాత ఫీజు రీయింబర్స్ మెంట్, ఇతర సౌకర్యాలు ఇవ్వాల్సి వస్తుందనే జగన్ ఇలా చేశాడు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ అన్నాడు. 5వ జనవరి కూడా పోయింది.. జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. రాష్ట్రానికి ఒక్కపరిశ్రమ తీసుకొచ్చి, ఒక్క ఉద్యోగం ఇచ్చిందిలేదు.

అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కుంటుపడ్డాయి. గవర్నర్ తో ముఖ్యమంత్రి 127 పాయింట్లను 134పేజీల పుస్తకాన్ని ప్రజల కోసం చదివించే ప్రయత్నం చేశారు. శాసనసభ సాక్షిగా వ్యవస్థల్ని దుర్విని యోగం చేసింది కాక, బరితెగించి అవాస్తవాలు చెప్పడంతో తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం సమావేశాల్ని బాయ్ కాట్ చేసింది. తర్వాతి రోజుల్లో సమా వేశాల్లోవాస్తవాల్ని ప్రజలముందు ఉంచే ప్రయత్నంచేస్తాం.” అని బీ.టీ.నాయుడు తెలిపారు.

లేని గొప్పల్ని ఉన్నట్టు గవర్నర్ తో అర్థసత్యాలు, అసత్యాలు పలికించే ప్రయత్నం చేసి జగన్ రెడ్డి నవ్వుల పాలయ్యారు :భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి
“ ప్రభుత్వంలో లేని గొప్పల్ని ఉన్నట్టుగా జగన్ రెడ్డి నేడు గవర్నర్ తో అర్థసత్యాలు, అసత్యాలు పలికించే ప్రయత్నం చేసి నవ్వుల పాలయ్యారు. విద్యా వ్యవస్థను పటిష్టపరిచినట్టు, నాడు-నేడు ద్వారా పాఠశాలల్ని ఆధునికీకరించిన ట్టు గవర్నర్ తో చెప్పించారు. తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో నాడు-నేడు పథకం కింద ఎన్ని పాఠశాలలు కొత్తగా ఏర్పాటుచేశారో, ఎన్ని పాఠశాలలకు ఫర్నీచర్, ఇతర సామాగ్రి అందించారో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.

ఇడుపుల పాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమకు ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ము అందలేదని, 4 విడతలకు గాను 3 విడతల సొమ్ము ఇచ్చి, ఒక విడత ఎగ్గొట్టారని నిరసన చేపట్టారు. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబ ర్స్ మెంట్ ఎగ్గొట్టిన ఘనుడు జగన్ రెడ్డే. నాడు-నేడు, అమ్మఒడి పథకాలతో అద్భుత ఫలితాలు సాధిస్తున్నట్టు చెప్పుకోవడం సిగ్గుచేటు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల నుంచి 7.50లక్షల మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారు.

ఉద్యానవన పంటలసాగుకు ముఖ్యమైన డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతికి చంద్రబాబు రైతులకు అందించిన 90శాతం సబ్సిడీ ఏమైందో ముఖ్యమంత్రి చెప్పాలి? కరువు మండలాలు ప్రకటించకుండా, పంటలబీమా సొమ్ము అందించకుండా జగన్ రెడ్డి సొంత జిల్లా రైతాంగాన్నే ఎక్కువగా నష్టపరిచాడు

వ్యవసాయానికి సంబంధించి కూడా ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. 2019కి ముందు రాష్ట్రంలో డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతులు పాటించి సాగుచేసే రైతులకు 90శాతం సబ్సిడీపై పరికరాలు అందేవి. ఇప్పుడు అలా అందుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పగలడా? పండ్లతోటల పెంపకం దారులకు గతంలో టీడీపీప్రభుత్వం సబ్సిడీపై మొక్కలు అందించింది. జగన్ రెడ్డి ఒక్క సంవత్సరమైనా రాయితీపై పండ్లమొక్కలు అందించాడా? కరువు మండలా లు ప్రకటిస్తే తనకు అవమానమని భావించిన జగన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని రైతుల్ని దారుణంగా వంచించాడు.

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం నుంచి వైదొలిగిన ప్రభుత్వ నిర్వాకంతో రాయలసీమ రైతులే ఎక్కువగా నష్టపో యారు. గత 20 ఏళ్లకంటే అత్యల్ప వర్షపాతం రాయలసీమలో నమోదైనా రైతు లకు జగన్ ప్రభుత్వం ఎలాంటి సాయం అందించలేదు. 2019 తర్వాత జగన్ ప్రభుత్వం ఒక్క ఎకరాకైనా అదనంగా నీరిచ్చిందా? పులివెందుల నియోజకవర్గం లో ఒక్క కాలువైనా ఒక్కకిలోమీటర్ అయినా పొడిగించాడా? జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ అని యువతను, సీపీఎస్ రద్దు అని ఉద్యోగుల్ని వంచించాడు. గవ ర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే సమయంలో గవర్నర్ తో చెప్పించిన అబద్ధాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తాము.” అని రామ్ గోపాల్ రెడ్డి చెప్పారు.

మద్య నిషేధం హామీ ఏమైందో ముఖ్యమంత్రి చెప్పాలి. అమ్మఒడి, నాడు-నేడు సహా అన్నిపథకాలపై గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారు : కంచర్ల శ్రీకాంత్
“ అసత్యాలను పుస్తకరూపంలో ముద్రించి మరీ జగన్ రెడ్డి, గవర్నర్ తో చదివించే ప్రయత్నం చేయడం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. 99 శాతం హామీలు నెరవేర్చామని చెప్పుకుంటున్న జగన్ రెడ్డి, మద్యనిషేధంపై ఏం చెబుతారు? ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో దశలవారీగా మద్యాన్ని నిషేధిస్తా నని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, 25 ఏళ్లలో మద్యం అమ్మకాలపై రాబోయే ఆదాయాన్ని తాకట్టుపెట్టి రూ.25వేలకోట్ల అప్పులు తెచ్చాడు.

విషం కంటే దారుణమైన జేబ్రాండ్ మద్యం అమ్మిస్తూ ఎన్నో కుటుంబాలకు పెద్దదిక్కు లేకుండా చేశాడు. నాడు-నేడు, అమ్మఒడి పేరుతో గవర్నర్ తో చెప్పించినవన్నీ అబద్ధాలే. జీవో నెం-117 తీసుకొచ్చి, పాఠశాలల్ని విలీనం చేసి, నాడు-నేడు కింద అభివృద్ధి చేసినట్టు చెప్పుకుంటున్న పాఠశాలల్ని కూడా నిరుపయోగంగా మార్చారు. ఎంతమంది విద్యార్థులు ప్రాథమికవిద్యకు దూరమయ్యారో ముఖ్య మంత్రికి తెలియదా? అమ్మఒడి పథకంలో 83 లక్షల మంది విద్యార్థులు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి.

చంద్రబాబు 87శాతం పూర్తిచేసిన పనుల్ని 5ఏళ్లలో జగన్ రెడ్డి పూర్తి చేయలేకపోయాడు. కుప్పం నియోజకవర్గానికి నీళ్లిస్తానని చెప్పి, ఒక్క ఎకరాకు కూడా ఇవ్వలేక భంగపడ్డాడు
కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా ద్వారా నీళ్లు ఇవ్వడానికి చంద్రబాబు హయాంలో 87శాతం పూర్తైన పనుల్ని, తన ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి ఎందుకు పూర్తిచేయలేదు? రైతులకు మేలు చేశానని చెప్పుకునే ముఖ్యమంత్రి కుప్పం నియోజకవర్గ రైతులకు ఎందుకు ఇవ్వలేకపోయారు? కాలువల నిర్మాణం పేరుతో కమీషన్లు కొట్టేసి, చంద్రబాబు తన నియోజకవర్గానికి వస్తున్నాడని తెలిసి, అప్పటికప్పుడు హడావుడిగా అనంతపురం వెళ్లాల్సిన నీటిని కుప్పానికి తరలించే ప్రయత్నం చేసి విఫలమైంది నిజం కాదా? రైతులు, మహిళలు, విద్యా ర్థులు, యువత, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలకు అన్యాయం చేసి, ఎన్నాళ్లు అబద్ధాలు చెప్పి మోసగించే ప్రయత్నం చేస్తారు?

జగన్ రెడ్డి హాయాంలోఒక్క విశాఖపట్నం నుంచే 18 పరిశ్రమలు తరలిపోయింది నిజం కాదా? రాష్ట్రం నుంచి వెళ్లిపోవడానికి తాను సిద్ధం అని జగన్ రెడ్డే చెబుతున్నాడు
నిరుద్యోగులకు ప్రభుత్వపరంగా ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వకుండా, చివరకు టీడీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు, పరిశ్రమలు కూడా తరలిపోయేట్టు చేశారు. ఎస్.టీ.పీ.ఏ ( సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పాక్స్ ఆఫ్ ఇండియా) వారు ఇచ్చిన సమాచారం ప్రకారం ఒక్క విశాఖపట్నం నుంచే 18 కంపెనీలు జగన్ రెడ్డి హయాంలో రాష్ట్రం నుంచి తరలిపోయాయి.

టీ.సీ.ఎల్, ఫాక్స్ కాన్, కియా అనుబంధ పరిశ్రమలు, రిలయన్స్ వంటి సంస్థలు ఈప్రభుత్వ తీరుతో విసిగిపోయి రాష్ట్రం నుంచి వెళ్లి పోయింది నిజం కాదా? జీతాలు పెంచుకుండా అంగన్ వాడీ సిబ్బందిని వేధిస్తు న్నారు. సిద్ధం..సిద్ధం అంటూ ముఖ్యమంత్రి ప్రజలసొమ్ముతో భారీ హోర్డింగ్ లు ఏర్పాటు చేశాడు. ఎన్నికల తర్వాత తాను రాష్ట్రం నుంచి వెళ్లిపోవడానికి సిద్ధం అని జగన్ రెడ్డే చెప్పుకుంటున్నాడు.” అని శ్రీకాంత్ ఎద్దేవాచేశారు.