జయ జయహే గీతానికి ప్రభుత్వం ఆమోదం

-జూన్‌ 2న దశాబ్ది ఉత్సవాల్లో జాతికి అంకితం చేస్తాం
-తెలంగాణ తల్లి విగ్రహం, చిహ్నం మారుస్తాం
-కేబినెట్‌లో చర్చించి అందరూ ఆమోదించాకే నిర్ణయం
-తప్పుడు ప్రచారం లేకుండా అసెంబ్లీలో కూడా చర్చిస్తాం
-రెండింటి నమూనాలను ఇంకా ఖరారు చేయలేదు
-తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
-ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: జయ జయహే తెలంగాణ గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తెలంగా ణ రాష్ట్రం ఆవిర్భవించి ఈ ఏడాది జూన్‌ 2 నాటికి పదేళ్లు పూర్తవుతున్న సంద ర్భంగా దశాబ్ది ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తు న్నామన్నారు. అదే వేడుకల సందర్భంగా జయ జయహే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు. సచివాలయంలో గురువారం సాయంత్రం శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖతో పాటు మాజీ మంత్రి జానారెడ్డి, ప్రొఫెసర్‌ కోదండరాం, కవి అందెశ్రీ, సంగీత దర్శకులు కీరవాణి, సీపీఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ బిల్లును ఆమోదించినప్పుడు సభలో ఉన్న మాజీ ఎంపీలు, ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన పార్టీల ప్రతినిధులతో రేవంత్‌ సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకల నిర్వహణపై చర్చించారు.

రెండు వెర్షన్లలో గీతం
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యమ కాలంలో ఉర్రూతలూగించి తెలంగాణ ఖ్యాతిని చాటిన ఈ గీతాన్ని భవిష్యత్తులో తరతరాలు పాడుకునేలా అందరి ఆమోదంతో రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు చెప్పారు. తెలంగాణ కవి, రచయిత అందెశ్రీ 20 ఏళ్ల కిందట రాసిన ఈ గీతాన్ని యథాతథంగా అమోదించినట్లు ప్రకటించారు. దీనికి ఆస్కార్‌ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతంతో పాటు స్వరాలు కూర్చినట్లు తెలిపారు. జయ జయహే తెలంగాణ గీతాన్ని రెండు వర్షన్లలో తయారు చేశారని.. 2.30 నిమిషాల నిడివితో ఒక వర్షన్‌, 13.30 నిమిషాల నిడివితో పూర్తి వర్షన్‌ ఉంటుందని వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపిం చేందుకు వీలుగా పూర్తి గేయంలో ఉన్న మూడు చరణాలతో రెండున్నర నిమిషాల నిడివితో సంక్షిప్త గేయం ఉంటుందని సీఎం ప్రకటించారు. ఈ రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణిస్తామని చెప్పారు.

తెలంగాణ తల్లి విగ్రహం, చిహ్నం మారుస్తాం
తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని, అందులో భాగంగానే రాష్ట్రానికి సం బంధించిన సంక్షిప్త రూపం టీఎస్‌ను టీజీగా మార్చినట్లు తెలిపారు. వాహనాల రిజిస్ట్రేషన్‌ నెంబర్లతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలు టీజీగా మార్పు చేశామన్నారు. కేబినేట్‌లో తీసుకున్న నిర్ణ యం మేరకే రాష్ట్ర గీతాన్ని ఆమోదించటం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయం జరిగిందని వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి దాదాపు 500 నమూనా లు తమకు అందినట్లు సీఎం చెప్పారు. ఇంకా నమూనాలన్నీ చర్చల దశలోనే ఉన్నాయని, చిహ్నానికి సంబంధించిన తుది రూపమేదీ ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా తుది నిర్ణయం తీసుకో లేదని, కళాకారులు వివిధ నమూనాలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహాలు, తప్పుడు ప్రచారాల కు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ ప్రతిష్ఠను ఇనుమడిరచేలా, భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా కీరవాణి సంగీత సారథ్యంలోని యువ గాయనీ గాయకుల బృందం ఆలపించిన తెలంగాణ గీతం అందరినీ అలరించింది.