గన్నవరం: పవిత్ర మజ్ యాత్రను రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ చైర్మన్, ప్రభుత్వ కార్యదర్శి హర్షవర్ధన్ సోమవారం గన్నవరం ఈద్గా జామా మసీదు హజ్ క్యాంపు నుంచి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. వక్ఫ్ బోర్డు సీఈవో, హజ్ కమిటీ ఈవో అబ్దుల్ ఖదీర్, హజ్ కమిటీ సభ్యులు, సీఆర్డీఏ అదనపు కమిషనర్ అలీంబాషా, దూదేకుల కార్పొరేషన్ ఎండీ గౌస్ పీర్, ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మస్తాన్వలి, తదితరులు యాత్రికులకు అభినందనలు తెలిపారు.