భారత్లో ఏటా అధిక రక్త ప్రసరణతో వచ్చే గుండెపోటు, పక్షవాతంతో 16 లక్షల మంది చనిపోతున్నారు. ప్రపంచంలో అత్యధికంగా సంభవించే గుండెపోటు మరణాలకు మొద టి ప్రధాన కారణం బీపీ ఎక్కువగా ఉండటమే. రెండో కారణం శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, మూడోది డయేరియా, నాలుగోది ఎయిడ్స్, ఐదోది టీబీ, ఆరోది మలేరియా అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో), భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఉమ్మడి నివేదిక తేల్చిచెప్పింది.