Mahanaadu-Logo-PNG-Large

కౌంటింగ్‌ కేంద్రాల్లో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌

ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు చేసుకోవాలి
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా

అమరావతి: రాష్ట్రంలో వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు చేయా లని అన్ని జిల్లాల అధికారులను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా ఆదేశించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి కౌంటింగ్‌ కేంద్రాలకు ఈవీఎంలను తరలించడానికి ఒక వైపు, అభ్యర్థులు, ఏజెంట్లకు మరోవైపు మార్గం ఉండాలని సూచించారు. ఆ కేంద్రాల్లో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌తో కంప్యూటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదే శించారు. వేగంగా డేటా ఎంట్రీ చేసేందుకు నిపుణులైన సిబ్బందిని నియమించు కోవాలని సూచించారు.