హైదరాబాద్: తెలంగాణ లోని ఇంటర్ కాలేజీ లకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 30వ తేదీ నుంచి మే 31వ తేదీ దాకా సెలవులు కొనసాగ నున్నాయి. మళ్లీ జూన్ 1వ తేదీన కాలేజీలు తెరుచు కోనున్నాయి. ఈ సెలవులు రాష్ట్రం లోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ ఇంటర్మీడియట్ కాలేజీలకు వర్తించ నున్నాయి. ఇంటర్ బోర్డు ఆదేశాలను ఉల్లంఘించి కాలేజీ లను నిర్వహించే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి ఇంటర్ బోర్డు ఆదేశాలకు అనుగుణంగా అడ్మిషన్లు తీసుకోవాలని, ఆ తేదీలను ప్రకటించినప్పుడే ప్రవేశాల ప్రక్రియ చేపట్టాలని సూచించారు.