Mahanaadu-Logo-PNG-Large

హోం మంత్రి అమిత్‌ షా ఫేక్ వీడియో కేసు నిందితులకు బెయిల్ మంజూరు

హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. ఈ కేసులో టీపీసీసీ సోషల్ మీడియా టీమ్ మెంబర్స్ పెండ్యాల వంశీ కృష్ణ, మన్నె సతీష్, నవీన్, ఆస్మా తస్లీమ్, గీత లను హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను ఈ రోజు నాంపల్లి కోర్టులో హాజరు పర్చరగా.. వారికి కోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. పది వేల రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు అయ్యింది.

తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిందితులు ప్రతీ సోమ, శుక్ర వారాలు కేసు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ ముందు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.. మరోవైపు, ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు హైదరాబాద్‌ లోనే మకాం వేశారు. హస్తిన పోలీసులు నిన్నటి నుంచి హైదరాబాద్‌ లోనే ఉండిపోయారు. హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉన్న ఐదుగురిని అరెస్ట్ చేయాలని ఢిల్లీ పోలీసులు చూస్తున్నట్లు సమాచారం.

ఈ కేసులో అరెస్ట్ అయిన ఐదుగురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రాత్రంతా విచారించారు. ఫేక్ వీడియోకి సంబంధించిన కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్‌ను హైదరాబాద్ పోలీసులు సీజ్ చేశారు.