హోంమంత్రి రాజీనామా చేయాలి: విజయసాయి  

అమరావతి, మహానాడు:  రాష్ట్ర హోంమంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేయడం వల్లనే రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్లిపోయిందన్నారు. బయటకు వస్తే ఏమవుతుందో తెలియని దారుణస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. హత్యలు జరగకుండా చూడటంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. దీనికి హోంమంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. ప్రభుత్వ  వైఫల్యంపై గవర్నర్ విచారణకు ఆదేశించాలని విజయసాయి డిమాండ్ చేశారు.