Mahanaadu-Logo-PNG-Large

నన్ను ఓడించాలని కుట్ర చేస్తే…కేసీఆర్‌ అడ్రస్‌ గల్లంతైంది

-కరీంనగర్‌ ప్రజలు దమ్మేందో చూపారు
-గ్యారంటీల కోసం కాంగ్రెస్‌ అంతు చూస్తాం
-కరీంనగర్‌ ప్రజలకు రుణపడి ఉంటా…
-మోదీహవాతోనే ఇంతటి మెజారిటీ దక్కింది
-కాంగ్రెస్‌ విష ప్రచారంతోనే బీజేపీ మెజారిటీ తగ్గింది
-ఫలితాల అనంతరం బండి సంజయ్‌ వ్యాఖ్యలు

కరీంనగర్‌: ’’బండి సంజయ్‌ గలీజోడు… ముస్లింలంతా ఏకమై ఆయనను ఓడించాలని కేసీఆర్‌ పిలుపునిచ్చిండు… ఏమైంది.. అందరూ ఏకమై నన్ను భారీ మెజారిటీతో గెలిపించారు. కేసీఆర్‌ అడ్రస్సే గల్లంతు చేశారు’’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. తనను ఓడించేందుకు ఒక వర్గం ఓట్లను ఏకం చేయాలనుకున్న కేసీఆర్‌, కాంగ్రెస్‌ నేతలు ఎన్ని కుట్రలు చేసినా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించి కరీంనగర్‌ ప్రజల దమ్ము చూపారని కొనియాడారు. కరీంనగర్‌ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హవాతోనే తనకు ఇంతటి మెజారిటీ దక్కిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇకనైనా ఇచ్చిన హామీలను నెరవేర్చా లని, లేనిపక్షంలో ప్రజల పక్షాన పోరాడి ఆ పార్టీ అంతు చూస్తామని హెచ్చ రించారు. ఎన్నికల ఫలితాలు ముగిసిన అనంతరం బండి సంజయ్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల వద్దకు వెళ్లి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చేతుల మీదుగా గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఈ విజయం కరీంనగర్‌ ప్రజలకు, కార్యకర్తలకు, మోదీకి అంకితం. వందరోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు.. 6 నెలలు దాటింది. మరో 3 నెలలు టైమిస్తున్నాం…అమలు చేసి తీరాలి. లేనిపక్షంలో ప్రజలను ఏకం చేస్తాం… తెగించి కొట్లాడతాం. కాంగ్రెస్‌ సంగతి చూస్తామని హెచ్చరించారు. రాజ్యాంగం మారుస్తారని, రిజర్వేషన్లు ఎత్తేస్తారని ఇండీ కూటమి దేశవ్యాప్తంగా విష ప్రచా రం చేసి ప్రజలను భయభ్రాంతులను గురిచేసింది. ఇంటికో లక్ష రూపాయలు అకౌంట్లో వేస్తామంటూ సాధ్యంకాని హామీలు గుప్పించి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేసింది. లేకుంటే ఎన్డీఏకు 400 సీట్లు వచ్చేవని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు వాస్తవాలు గ్రహించి బీజేపీకి అత్యధిక సీట్లు కట్టబెట్టారని తెలిపారు.