ఇది ప్రజా విజయం

-సహకారించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు
-కాంగ్రెస్‌, మజ్లిస్‌ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లు
-విజయోత్సవ ర్యాలీలో కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ ఎంపీగా తనను గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ కార్యకర్తలకు కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం ప్రజా విజయమని తెలిపారు. మంగళవారం విజయం అనంతరం సికింద్రా బాద్‌ నియోజకవర్గంలో ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌, మజ్లిస్‌ పార్టీలను ప్రజలు తిప్పికొట్టి బీజేపీని బలపరిచారని తెలిపారు. బుధవారం ఉదయం ఢల్లీిలో పార్టీ సమావేశానికి హాజరయ్యేందుకు వెళుతున్నానని, తాను ఢల్లీి నుంచి వచ్చాక బీజేపీ విజయానికి కృషి చేసిన ప్రతిఒక్కరిని కలుస్తానని హామీ ఇచ్చారు. రెండో వారంలో నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయను న్నారని స్పష్టం చేశారు. తన విజయంలో బీజేపీ మహిళా మోర్చా, స్థానిక మహిళా కమిటీల పాత్ర కీలకమని అక్కాచెల్లెమ్మళ్లకు కృతజ్ఞతలు తెలిపారు.