జగన్ రెడ్డి, ఎన్నికల తర్వాత జైలుకెళ్లడం ఖాయం

– టీడీపీ-జనసేన అభ్యర్థుల ప్రకటనతో తాడేపల్లి ప్యాలెస్ కింద భూకంపం
– వైసీపీనేతల ప్యాంట్లు తడుస్తున్నాయి
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు

టీడీపీ-జనసేన పార్టీల అధినేతల ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటనతో ఏకంగా తాడేపల్లి ప్యాలెస్ కిందే భూకంపం వచ్చిందని, రాష్ట్రంలో ఎండలు పెరిగినప్పటికీ తాడేపల్లి కొంపలో మాత్రం ఎన్ని ఎయిర్ కూలర్లు వేసినా, అక్కడున్న నాయకుల కు చెమటలు ఆగడంలేదని, తెలుగుదేశం-జనసేన పొత్తు ప్రకటించింది మొదలు, నేటి అభ్యర్థుల ప్రకటన వరకు జగన్మోహన్ రెడ్డి, వైసీపీనేతలు ఎందుకంతగా మితిమీరి స్పందిస్తున్నారో తెలియడంలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు అభిప్రాయపడ్డారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …“ టీడీపీ-జనసేన కలిసే పోటీచేస్తాయని తొలినుంచీ చెబుతూనే ఉన్నాం. ఇరుపార్టీ లు పొత్తుకు సిద్ధమైనప్పటినుంచీ వైసీపీ ఏదోరకంగా తమమధ్య విబేధాలు సృష్టించడానికి చేయాల్సిన కుట్రలన్నీ చేశారు. తాజాగా టీడీపీ-జనసేన అభ్యర్థుల ప్రకటన తర్వాత కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పాతపాటే మాట్లాడితే వై.వీ. సుబ్బారెడ్డి, మంత్రులు అంబటి, రోజా సహా వైసీపీనేతలంతా ఒకరితర్వాత ఒకరు తమకొచ్చిన వణుకుడు రోగంతో మాట్లాడారు. 175స్థానాలు గెలుస్తామని గొప్ప లు చెబుతున్న వైసీపీనేతలు టీడీపీ-జనసేన పొత్తుని చూసి ఎందుకు భయపడుతున్నారు?

టీడీపీ-జనసేన ఒకేసారి 99మంది అభ్యర్థుల్ని ప్రకటించేసరికి వైసీపీనేతల ప్యాంట్లు తడుస్తున్నాయి. ప్రతిపక్షపార్టీల పొత్తుపై ఏడ్చే బదులు..ఐదేళ్లలో తాను చేసింది జగన్ రెడ్డి ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు?

ప్రతిపక్షపార్టీల పొత్తుపై పడి ఏడ్చే బదులు జగన్ రెడ్డి ఐదేళ్లలో తానేం చేసింది చెప్పుకొని ఎందుకు ముందుకు వెళ్లలేకపోతున్నాడు? టీడీపీ-జనసేన నుంచి పోటీచేసే 99మంది అభ్యర్థుల్ని ఒకేసారి ప్రకటించడంతో వైసీపీనేతల ప్యాంట్లు తడుస్తున్నాయి. టీడీపీ అధినేత సుదీర్ఘ కసరత్తు చేసి తొలిజాబితా ప్రకటించిన వెంటనే వైసీపీలో కొత్త ముసలం మొదలైంది. గతంలో జగన్ రెడ్డి ప్రకటించిన వైసీపీ ఇన్ ఛార్జులకు భయం పట్టుకుంది. 50 రోజుల్లో మొత్తం తతంగం ముగిసి పోతున్నాకూడా జగన్ రెడ్డి ఇప్పటికీ పూర్తిగా ఒక్క స్థానానికి కూడా అభ్యర్థిని ప్ర కటించలేదు.

చంద్రబాబునాయుడు గతంలో కాపులకు ఇచ్చిన 5 శాతంరిజర్వేషన్లు, వారి కోసం వేలకోట్లతో ఏర్పాటుచేసిన కాపు కార్పొరేషన్ ను జగన్ రెడ్డి రద్దు చేసినప్పుడు ఆయన చుట్టూ ఉన్న ఆ వర్గం నేతలు ఎందుకు నోరెత్తలేదు? జగన్ రెడ్డి ప్రతి బహిరంగసభలో పవన్ కల్యాణ్ ను తిడుతున్నా ఏనాడూ వైసీపీ కాపునేతలు మాటమాత్రంగా కూడా స్పందించింది లేదు. టీడీపీ-జనసేన పొత్తు ప్రజలు అంగీకరించిన, మనస్ఫూర్తిగా ఆహ్వానించిన పొత్తు. ప్రజలే స్వయంగా ఏర్పాటుచేసిన పొత్తు. అలాంటి పొత్తుతో వైసీపీ చిత్తు అవుతోం దనే జగన్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. ఎన్నికలయ్యాక జగన్ రెడ్డి బతుకు ఎలా ఉంటుందో చూడాలి. ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకొని తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నా డు. ఆ పదవి కాస్త పోతే ఆయనకు ఎలా ఉండాలో అలా ఉంటుంది.

టీడీపీ ఒక్కరోజే 94 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. జగన్ రెడ్డి 7జాబితాల విడుదల చేసినా నేటికీ ఒక్కవైసీపీ అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. మా పార్టీ ఇన్ ఛార్జ్ లు ఎవరూ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కారని స్వయంగా వై.వీ.సుబ్బా రెడ్డే అంటున్నాడు. దాన్నిబట్టే ఒక్క అభ్యర్థినికూడా వైసీపీ ప్రకటించలేదని అర్థ మైంది. కూలి..నీలి మీడియాను అడ్డుపెట్టుకొని జగన్ రెడ్డి కావాలనే టీడీపీ-జనసే నల్ని తిట్టిస్తున్నాడు. ఎన్నికల్ని ఎదుర్కోవడం చేతగాక.. గెలిచే చేవలేకనే జగన్ రెడ్డి ఇలా బరితెగించాడు. ఒక దుర్మార్గుడు..దుష్టుడు.. పనికిమాలిన ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తిని సాగనంపడానికి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేయడానికి పొత్తులు అవసరం. మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమిలో, ఇండియాకూటమి లో ఎన్ని పార్టీలున్నాయి? 50 రోజుల్లో వైసీపీ కథ ముగుస్తుంది.” అని ఆనంద్ బాబు తెలిపారు.